V A Friday

V A Friday

Share

Inspirational Wise Words for Youth to Achieve Success in Life Inspiring Young People - Tips for celeb

20/05/2025

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://vanewstimes.in

16/05/2025

https://vanewstimes.in

Gujarat Titan: ఐపీఎల్ 2025 (IPL 2025)లో గుజరాత్ టైటాన్స్ జట్టు చాలా మంచి లయలో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 16 పాయింట్లు సాధించింది. గ్రూప్ దశలో గుజరాత్ టైటాన్స్ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి అతిపెద్ద పోటీదారులలో ఒకటిగా నిలిచింది. ఈ కారణంగా జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ కోసం తన సన్నాహాలను ముమ్మరం చేసింది. నిజానికి, ఆర్‌సీబీ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. గుజరాత్ కూడా అతని స్థానంలో ఆటగాడిని ప్రకటించింది. వివాదాలతో సుదీర్ఘ చరిత్ర ఉన్న బట్లర్ స్థానంలో గుజరాత్ ఒక ఆటగాడిని ఎంపిక చేయడం గమనార్హం.

Table of Contents
మొత్తం జట్టు ప్రాణాలను ప్రమాదంలో పడేసిన వ్యక్తి గుజరాత్‌‌లోకి ఎంట్రీ..
హిట్ అండ్ రన్ కేసులో కూడా..
మొత్తం జట్టు ప్రాణాలను ప్రమాదంలో పడేసిన వ్యక్తి గుజరాత్‌‌లోకి ఎంట్రీ..
గుజరాత్ టైటాన్స్ జట్టులో జోస్ బట్లర్ స్థానంలో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్‌ను చేర్చుకున్నట్లు ప్రకటించింది. కుసల్ మెండిస్ మే 26న గుజరాత్ జట్టులో చేరనున్నాడు. ఈ కారణంగా అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి, PSL 2025లో, అతను క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్నాడు. కానీ, ఐపీఎల్ లాగానే, పీఎస్‌ఎల్ సస్పెన్షన్ తర్వాత, అతను తన దేశానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు పీఎస్‌ఎల్‌ను వదిలి ఐపీఎల్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతను తొలిసారి ఐపీఎల్‌లో భాగం కాబోతున్నాడు.

కుశాల్ మెండిస్‌కు వివాదాలతో సుదీర్ఘ చరిత్ర ఉంది. 2021 సంవత్సరంలో, అతను మొత్తం జట్టు ప్రాణాలను ప్రమాదంలో పడేశాడు. నిజానికి, అప్పుడు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. కరోనా కారణంగా జట్టు బయో-బబుల్‌లోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో, కుశాల్ మెండిస్, ఇద్దరు తోటి ఆటగాళ్లతో కలిసి, బయో-బబుల్‌ను బ్రేక్ చేసి హోటల్ నుంచి బయటకు వెళ్లాడు. అతను డర్హామ్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. ఆ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ముగ్గురు ఆటగాళ్లపై కీలక చర్యలు తీసుకుని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఒక సంవత్సరం పాటు నిషేధించింది.

ఇవి కూడా చదవండి

హిట్ అండ్ రన్ కేసులో కూడా..
2020 సంవత్సరంలో కూడా కుశాల్ మెండిస్ అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చాడు. ఆ సమయంలో అతను సైకిల్ పై వెళ్తున్న 64 ఏళ్ల వ్యక్తిని తన కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో, వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసులో ఆటగాడిని అరెస్టు చేశారు. తన కెరీర్ గురించి మాట్లాడితే, మెండిస్ శ్రీలంక తరపున 71 టెస్టుల్లో 4668 పరుగులు, 143 వన్డేల్లో 4429 పరుగులు చేశాడు. అతను 76 టీ20ల్లో 1920 పరుగులు చేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

https://vanewstimes.in

16/05/2025

మరిన్ని జాతీయ వార్తల https://vanewstimes.in

16/05/2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://vanewstimes.in

16/05/2025

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://vanewstimes.in

15/05/2025

భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సమయంలో టర్కీ(తుర్కియో) పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపింది. దీంతో ఇండియన్స్‌ ఆ దేశంపై ఆగ్రహంగా ఉన్నారు. పాకిస్థాన్‌తో పాటు పనిలో పనిగా టర్కీ పని కూడా పట్టేయాలంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇక్కడ నుంచి నేరుగా టర్కీ దేశంలో ఏ ప్రదేశంపైనైనా దాడి చేయగల సత్తా ఇండియాకు ఉంది. ఒక్క బటన్‌ నొక్కితే చాలా అగ్ని-5 అనే క్షిపణి టర్కీ దేశంపైకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించగలదు.

ఇండియా అగ్ని-5 క్షిపణి ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి టర్కీ వరకు దాడి చేయగల సామర్థ్యం కలిగిన క్షిపణి. భారతదేశం నుండి టర్కీకి దూరం దాదాపు 4500-5000 కిలోమీటర్లు. అగ్ని-5 క్షిపణి పరిధి కూడా అంతే. అగ్ని-5 భారతదేశంలో అత్యంత అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, దీనిని DRDO అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి.

అగ్ని-5 క్షిపణి 1.5 టన్నుల వరకు అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. అగ్ని-5 శ్రేణి మొత్తం ఆసియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని ఉత్తర ప్రాంతాలను కవర్ చేస్తుంది. భారతదేశ క్షిపణి సాంకేతికతలో అగ్ని-5 ఒక మైలురాయి. అగ్ని-5 క్షిపణి టర్కీలోని ఏ ప్రాంతాన్ని అయినా లక్ష్యంగా చేసుకోగలదు. భారత్‌, టర్కీ మధ్య సైనిక వివాదం లేనప్పటికీ, ఉద్రిక్తతలో పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా అది పెద్ద తప్పు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..https://vanewstimes.in

15/05/2025

https://vanewstimes.in

ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చెక్‌ చేయడానికి EPF పాస్‌బుక్ వెబ్‌సైట్‌తో మీరు సమస్యలను ఎదుర్కొంటున్నారా? చింతించకండి! ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మిస్డ్ కాల్ సర్వీస్, SMS సర్వీస్ వంటి అవాంతరాలు లేని ప్రత్యామ్నాయాలను అందిస్తుంది. ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం లేకుండా లేదా సాంకేతిక లోపాలను నావిగేట్ చేయకుండా మీ PF బ్యాలెన్స్‌ను తక్షణమే చెక్‌ చేసుకోవచ్చు. EPF పాస్‌బుక్ వెబ్‌సైట్ డౌన్ అయితే లేదా మీరు లాగిన్ సమస్యలను ఎదుర్కొంటే మిస్డ్ కాల్, SMS సేవలతో మీ PF బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Table of Contents
మిస్డ్ కాల్ సర్వీస్ ఉపయోగించి PF బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలి?
SMS సర్వీస్ ఉపయోగించి PF బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలి?
మిస్డ్ కాల్ సర్వీస్ ఉపయోగించి PF బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలి?
యూనిఫైడ్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ UANతో యాక్టివేట్ అయి ఉండాలి. KYCలలో ఏదైనా ఒకటి అందుబాటులో ఉండాలి. a. బ్యాంక్ ఖాతా నంబర్. b. ఆధార్ c. పాన్. ఇక ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 కు డయల్ చేయండి. రెండు రింగ్‌ల తర్వాత కాల్ దానికదే డిస్‌కనెక్ట్ అవుతుంది. కాల్‌ కట్‌ అయిన కొద్ది సేపటికే మీ తాజా PF బ్యాలెన్స్, చివరి సహకార వివరాలతో మీకు SMS వస్తుంది. అయితే ఈ సర్వీస్‌ KYC పూర్తయిన UAN-యాక్టివేట్ చేయబడిన సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు సమస్యలను ఎదుర్కొంటే మీ కంపెనీ లేదా EPFO ​​పోర్టల్ ద్వారా మీ KYCని అప్డేట్‌ చేసుకోవాలి.

SMS సర్వీస్ ఉపయోగించి PF బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలి?
మీ PF బ్యాలెన్స్‌ను తక్షణమే యాక్సెస్ చేయడానికి SMS సేవ మరొక ఆఫ్‌లైన్ పద్ధతి అందుబాటులో ఉంది. దీని కోసం మీ UAN యాక్టివేట్ చేయబడి, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి SMS పంపాలి. eKYCని UAN పోర్టల్‌లో పూర్తి చేయాలి. 7738299899 కు EPFOHO UAN LAN అని మేసేజ్‌ పంపాలి. UAN స్థానంలో మీ 12-అంకెల యూనివర్సల్ ఖాతా నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. LAN స్థానంలో మీకు నచ్చిన భాషలోని మొదటి మూడు అక్షరాలను (ఉదా., ఇంగ్లీష్ కోసం ENG, హిందీ కోసం HIN, మరాఠీ కోసం MAR, మొదలైనవి) ఎంటర్‌ చేయాలి.

ఉదాహరణ: EPFOHO 123456789012 ENG
మీ PF బ్యాలెన్స్, చివరి సహకారం, KYC వివరాలతో కూడిన SMS మీకు అందుతుంది. ముందస్తుగా క్లెయిమ్ చేసే ముందు వడ్డీ జమ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి, విత్‌డ్రా అర్హతను తెలుసుకోవడానికి మీరు మీ PF బ్యాలెన్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.

15/05/2025

జస్ట్‌ మిస్డ్‌ కాల్‌, SMSతో ఫ్రీగా మీ పీఎఫ్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు! స్టెప్‌ బై స్టెప్‌ ఇలా ఫాలో అయిపోయింది..

https://vanewstimes.in

14/05/2025

టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న వార్ 2.. కారణం అదే..

ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన గ్యాప్.. ఇకపై రాకూడదని వరస సినిమాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. గతేడాది దేవరతో వచ్చిన ఈయన.. ఏడాది తిరిగేలోపే వార్ 2 అంటూ ఆగస్ట్ 14న వచ్చేస్తున్నారు.

Communication Skills 06/05/2025

Communication Skills

Communication Skills Communication Skills Public Speaking Effective Communication Interpersonal Communication Nonverbal Communication Presentation Skills Verbal Communication Act...

Want your business to be the top-listed Beauty Salon in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad
500080